జోగులాంబ గద్వాల : వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ను ఎంపీ రాములు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జెడ్పీ చైర్ పర్సన్ సరిత, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ప్రజలు వివిధ రకాల పరీక్షలు చేయించుకోవడానికి ప్రైవేట్ ల్యాబల్కు వెళ్లి వేలు ఖర్చు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసేలా ప్రభుత్వం డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసిందన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు త్వరలో జిల్లాకు గుండెకు సంబంధించి పరికరాలు అందజేయడంతో పాటు 2డీ ఈసీజీ థెరపీ తదితర పరీక్షలు ఇక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గద్వాలకు నర్సింగ్ కళాశాల మంజూరు అయిందని తెలిపారు. ప్రతి జిల్లాలో వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఆహార పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పారు.
కార్యక్రమంలో కలెక్టర్ శృతి ఓజా జిల్లా వైద్యాధికారి, చందు నాయక్ జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం