భూపాలపల్లి : జర్నలిస్టుల సంక్షేమమే(Journalists Welafare) ధ్యేయంగా మీడియా అకాడమీపనిచేస్తుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్(Media Academy Chairman) అల్లం నారాయణ అన్నారు. శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్ నగర్ సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్ లో జిల్లాలోని జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు(Training Classes) ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. తెలంగాణ మీడియా ఆధ్వర్యంలో రాష్ట్రమంతా శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 20వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు(Accreditations) ఇప్పించామని పేర్కొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం రూ. 42 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని వివరించారు. కరోనా సమయంలో జర్నలిస్టులకు రూ. 7 కోట్లు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు తదితరులు పాల్గొన్నారు.