ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే సమ్మక్క-సారక్క మహా జాతర పూజారి సిద్ధమైన లక్ష్మణ్ రావు(48) అనారోగ్యంతో గురువారం ఉదయం మృతి చెందారు. సిద్ధబోయిన లక్ష్మణ్ రావుకు భార్య అనిత, పిల్లలు సౌమ్య, నితిన్ ఉన్నారు. గత నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
అనంతరం ఇంటి వద్దనే ఉంటూ మందులు వాడుతున్నాడు. రెండు రోజుల క్రితం నుంచి లక్ష్మణరావు జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. పూజారి లక్ష్మణరావు మృతి విషయం తెలుసుకున్న గిరిజన స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చుతూ ప్రకటన విడుదల చేశారు.