ఈ నెల 16 నుంచి 19 వరకు జరుగనున్న మేడారం జాతర ఆహ్వాన పత్రికను గిరిజన సంక్షేమశాఖ ఆదివాసీ సంస్కతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించింది. ఈసారి కాఫీటేబుల్ బుక్ గిఫ్ట్తో ప్రత్యేకంగా తయారుచేశారు. ఇందులో అందమైన ఫ్రేమ్లతో కోయ, గోండ్ పెయింటింగ్స్ ఉన్నాయి. రంగులతో తయారుచేసిన శిరస్సు, మైనపు సాంకేతికతో ఓజా గోండ్స్ తయారు చేసిన ఇత్తడి క్రాఫ్ట్-తాబేలు, లంబాడీ స్త్రీలు నేసిన బంజారా హస్తకళ పౌచ్లో సమ్మక్క-సారలమ్మ పవిత్రమైన బండారి (పసుపు) పొడితో అత్యంత సుందరంగా రూపొందించారు. ఇప్పటికే ఈ పత్రికతో వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు, జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులను మేడారం జాతరకు ఆహ్వానించారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ