ములుగు : మేడారం సమ్మక్క-సారలమ్మల హుండీల ఆదాయం రూ.26లక్షల 70వేల 299 సమకూరింది. గత మార్చి నెల నుంచి అమ్మవార్ల గద్దెలపై 10 హుండీలు ఏర్పాటుచేయగా భక్తులు వేసిన కానుకలతో అవి నిండడంతో బుధవారం మేడారం జాతర కార్యనిర్వాహక అధికారి రాజేంద్రం ఆధ్వర్యంలో లెక్కించారు.
పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ వెంకటేశ్వర్రావుల సమక్షంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలోని షెడ్డులో హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. హుండీ ఆదాయాన్ని తాడ్వాయి సిండికేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు.