Suicide | మెదక్ : మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డ్రైవర్ శివరాములు(42) ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ పట్టణంలోని పిల్లి కొట్టల్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూం హౌజ్ కాలనీలోని తన ఇంట్లో శివరాములు ఉరేసుకున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం శివరాములు తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాములు ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ఈ ఘటనకు పాల్పడిన సమయంలో రాములు భార్య ఇంట్లో లేదు.
సోమవారం ఉదయం పిల్లలు నిద్ర లేచేసరికి తండ్రి రాములు ఉరేసుకున్న దృశ్యాన్ని చూసి షాకయ్యారు. అనంతరం బంధువులకు పిల్లలు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్బాడీని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.