మెదక్ : భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. క్రిస్మస్ ముందు వచ్చిన ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు రావడంతో చర్చి ప్రాంగణంలో సందడి నెలకొంది. యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి గంట గంటకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు.
చర్చి ప్రేసీబేటరీ ఇంచార్జీ ప్రేమ్ సుకుమార్ భక్తులనుద్దేశించి దైవ సందేశం చేశారు.
భక్తులు తమ మొక్కులు తీర్చుకున్న అనంతరం చర్చి మైదానంలోని చెట్లకింద వంటావార్పు చేసుకున్నారు.
ఫాస్టర్లు దయానంద్, రాజశేకర్, జైపాల్, వర్జర్, డేవిడ్లు భక్తులను ఆశీర్వదించారు. ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు రోలండ్పాల్, సంశాన్ సందీప్, సునీల్, శాంతికుమార్, సుశీల్ కుమార్, జాయ్ముర్రే, సువన్డగ్లస్, తదితరులు పాల్గొన్నారు.