మెదక్ మున్సిపాలిటీ, మార్చి 29 : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో(Medak Church_ శుక్రవారం గుడ్ఫ్రైడే(Good Friday) సందర్భంగా వేలాది మంది భక్తులు(Devotees) ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు శిలువను ఊరేగించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రార్థనలు జరిగాయి. ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువుల ఆశీర్వాదాలు పొందారు.
శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు. శిలువకు తనకు తానే లోక పాపములను పోగొట్టుటకు శిలువ ఎక్కాడు. ఆ దినమున పలికిన 7 ప్రవచనాలను భక్తులు ధ్యానం చేయడం ఈ రోజు ప్రత్యేకత. చర్చి ప్రేసీబేటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య దైవ సందేశం చేశారు.
ఏసు శిలువ వేయబడిన తర్వాత తన చివరి ఏడు మాటల గురించి భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా మెదక్ డయాసిస్ పరిధిలోని పలు జిల్లాల నుంచి క్రైస్తవులు భారీగా తరలిరావడంతో చర్చి ప్రాంతం కిటకిటలాడింది.