హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : మాజీ సైనికుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, తెలంగాణ ఎక్స్ సర్వీస్మెన్ కార్పొరేషన్ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ పేరొన్నారు.
పంజాగుట్టలోని సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ను ఆయన సోమవారం సందర్శించారు. ‘మన సైనికులు’ వెబ్సైట్లో సుమారు 40,000 మంది మాజీ సైనికుల వివరాలు నమోదయ్యాయని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నగదు గ్రాంట్లు, గృహ నిర్మాణం, విద్య, ఉపాధి సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.