హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీల పాలన అధికారులకు అప్పగించకుండా, ప్రస్తుత సర్పంచ్లనే పర్సన్ ఇన్చార్జిలుగా నియమించి కొనసాగించాలని ప్రభుత్వానికి ఎంబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ల పదవీకాలం ఫిబ్రవరి రెండోవారంలో ముగియనున్నదని తెలిపారు.
కులగణన చేపట్టి, బీసీల రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారులకు అప్పగిస్తే పంచాయతీల పాలన గాడితప్పుతుందని అభిప్రాయపడ్డారు.