హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ రెండేండ్లు చెన్నైలో పూర్తి చేసిన విద్యార్థినిని నాన్ లోకల్ గా పరిగణించరాదని హైకోర్టు స్పష్టంచేసింది. స్థానిక కోటాలో ఆమెకు ఎంబీబీఎస్ సీటు కేటాయించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, కాళోజీ నారాయణరావు వర్సిటీకి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. తల్లిదండ్రులిద్దరు ఉద్యోగరీత్యా చెన్నైకి బదిలీకావడంతో అకడ ఇంటర్ చదివానని, అయితే తనను నాన్ లోకల్ గా పరిగణించి ఎంబీబీఎస్ సీటు ఇవ్వడం లేదంటూ హైదరాబాద్ కు చెందిన విద్యార్థిని ప్రశంస రాథోడ్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది.