బంజారాహిల్స్, మార్చి 30: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జాబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లిన విజయలక్ష్మికి కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయలక్ష్మితోపాటు ఆమె సోదరుడు వెంకటేశ్వరరావు కూడా కాంగ్రెస్లో చేరారు.