Lok bhavan | నీట్ స్కాం కారణంగా విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన సీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. మూడు గంటల పాటు నిరసన కొనసాగగా పోలీసులు రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థుల నిరసన సెగ హైదరాబాద్ను తాకింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు విద్యార్థులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ లోక్భవన్ వద్ద విద్యార్థుల నిరసన బాట పట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు తెలంగాణ లోక్ భవన్ వెలుపల ఆందోళన చేపట్టాయి.
నీట్ కుంభకోణం కారణంగా 21 మంది విద్యార్థులు మరణించిన ఘటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జవాబుదారీగా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలతో దాడి చేసి ఈడ్చుకుంటూ వెళ్లారు. విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
తెలంగాణ లోక్భవన్ వద్ద ఉద్రిక్తత
నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీలతో దాడి చేసి.. ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు తెలంగాణ లోక్ భవన్ వెలుపల నిరసన
నీట్ కుంభకోణం కారణంగా 21… https://t.co/UFquvbmLd0 pic.twitter.com/NJKV7zI82L
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
హైదరాబాద్ – సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు భారీగా చేరుకుంటున్న విద్యార్థులు
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు తరలివస్తున్న విద్యార్థులు, మద్దతుదారులు https://t.co/1PHIpJYkdI pic.twitter.com/E1mNEW1MWE
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
Watch: జిప్లైన్ సేఫ్టీ లాక్ ఫెయిల్.. 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన టూరిస్ట్
Health News | రోజుకు 5 కప్పుల వరకు కాఫీ తాగడం సురక్షితమే.. తాజా అధ్యయనంలో వెల్లడి..!