హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): దేశంలో దళిత క్రైస్తవులపై బీజేపీ దాడులు చేయటాన్ని క్రైస్తవ సమాజం ఖండించింది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళిత క్రైస్తవుల మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తున్న ఆరాచకాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ప్రధాని మోదీకి దళిత క్రైస్తవుల తరపున టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా రాజ్యాంగ హకులు దళితులకు దకకుండా బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. క్రైస్తవ మతంలో చేరిన దళితులకు ఎస్సీ హోదా కల్పించటం సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 2004లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రంగనాథ్ మిశ్రా కమిషన్ ఎస్సీ హోదాకు మతంతో సంబంధ లేదని సిఫారసు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు.