జగిత్యాల : జగిత్యాల పట్టణంలో ప్రజల అభీష్టం మేరకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. బుధవారం పట్టణంలోని 10వ వార్డ్లో గంగ పుత్ర సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పట్టణ మాస్టర్ ప్లాన్ అస్తవ్యస్తంగా తయారయిందని ఆరోపించారు.
యావర్ రోడ్డు విస్తరణ ను గతంలో మంత్రులు గా ఉండి ఏమి చేయలేక పోయారని విమర్శించారు. నేడు నూతన నిర్మాణాలు వంద ఫీట్లలల్లో జరుగుతున్నాయని తెలిపారు.మాస్టర్ ప్లాన్ ప్రజల సౌకర్యార్థం కోసమేనని వెల్లడించారు. గంగ పుత్రులు అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు.మిషన్ కాకతీయ వల్ల చెరువుల్లో జల కల సంతరించుకుందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల వరద కాలువ జీవ నదిలా మారి నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెరిగాయని పేర్కొన్నారు.దీంతో మత్స్య సంపద పెరిగి గంగ పుత్రుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతుందని తెలిపారు.