హైదరాబాద్ : రాష్ట్రంలో(Telangana) మారోసారి పలువురు ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన జిల్లాలు, వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నతాధికారుల మార్పులు జరిగాయి. ఈ నెలాఖరుతో చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుండటంతో అతడిని సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమించింది. సీఎంవో నుంచి అజిత్ రెడ్డికి ఉద్వాసన పలికి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా బదిలీ చేసింది. ఎన్. శ్రీధర్కు ముఖ్యమంత్రి సెక్రటరీగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. సభ్యసాచి ఘోష్కు హ్యాండ్ల్యూమ్, టెక్స్టైల్స్ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది.
అలాగే శైలజా రామయ్యర్ను అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, అహ్మద్ నదీమ్కు పొలిటికల్(GAD) ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. రాహుల్ బొజ్జాకు ప్రకృతి విపత్తుల మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఎం. రఘునందన్రావుకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. పి. కాత్యాయని దేవి హ్యాండ్లూమ్స్ హ్యాండీ క్రాఫ్ట్స్ స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం కె. గంగాధర్ను ఆర్అండ్బీ స్పెషల్ సెక్రటరీగా బదీలీ చేసింది. టి. వెంకన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా, కె. విద్యాసాగర్ను టూరిజం డైరెక్టర్గా నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.