యాదాద్రి భువనగిరి : ఆలేరు పట్టణంలోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సాయిబాబా ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ప్రధాన ద్వారం తాళాలు కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు.
సుమారు 35 కిలోల వెండి, 5 తులాల బంగారు చైను, 45 వేల విలువగల యూఎస్ డాలర్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. స్థానికుల సమాచారం మేరకు..సంఘటన స్థలానికి చేరుకున్న ఆలేరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.