మహబూబాబాద్ : జిల్లాలోని కేసముద్రం మండలం అమీనాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. 27కిలోల వెండి ఆభరణాలు, 5 తులాల బంగారం ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..పూజారి ప్రతి రోజు మాదిరిగానే శనివారం రాత్రి 7 గంటలకు గుడి తలుపులు మూసి తాళం వేసి వెళ్లాడు.
తిరిగి పూజారి రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 7గంటలకు పూజలు చేసేందుకు వెళ్లగా గుడి తలుపులు తెరిచి ఉన్నాయి. ఈ విషయాన్ని వెంటనే ఆలయ కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకొని డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్తో దొంగల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.