నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ ప్రజలకు స్వేచ్ఛావాయువులు అందించేందుకు పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొంటూ ఫ్రీడమ్ పార్కులను మంత్రులు ప్రారంభించారు.
అనంతరం ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పార్కుల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయా జిల్లాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు తన్నీరు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ తదితరులు మొక్కలు నాటారు.