మహబూబ్నగర్ అర్బన్/తెలకపల్లి/నందిపేట్, డిసెంబర్ 20: బీఆర్ఎస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్య కర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం మహబూబ్నగర్ లోని శివశక్తినగర్లో 300మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డకు చెందిన కాంగ్రెస్ సర్పంచ్ ఈశ్వరయ్య, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు 150 మంది నడిగడ్డలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీజేపీ నాయకుడు జక్కం పోశెట్టితోపాటు మరికొందరు నాయకులు ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.