ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఎన్ఆర్ఐలు ద్యాగేటి ఉదయ్కుమార్ యాదవ్, పూస్కూరు పవన్ కుమార్రావు.. బుధవారం ధర్మారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే బీజేపీ యూత్ నేత పెరుమాండ్ల ప్రసాద్ (లడ్డూ), ఎన్ఆర్ఐలు మద్దతుదారులతో భారీ ర్యాలీ నిర్వహించి గౌతమ బుద్ద ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్లో చేరారు. -ధర్మారం