సూర్యాపేట : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలకు చెందిన సుమారు 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో తుంగతుర్తి నియోజకవర్గo అంటే కక్షలు, హత్యలు, రక్తపాతాలకు నిలయం ఉండేది. కాగా, తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిల సహకారంతో నియోజకవర్గ రూపురేఖలు మార్చేశానని చెప్పారు.
నాడు ఇక్కడి ప్రజలకు పని దొరక్క వలసలు వెళ్లగా.. నేడు గోదావరి జలాలు రావడంతో చేతినిండా పని దొరకడమే కాక.. ఇతర రాష్ట్రాల కూలీలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు డిపాజిట్లు దక్కించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాయన్నాయని ఎద్దేవా చేశారు.