మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని హన్వాడలో బీజేపీ చెందిన వంద మంది కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కులం, మతం పేరుతో పాదయాత్రలు చేపడుతున్న పార్టీల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రైతు బీమా, పంట పెట్టుబడి, దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలోని ప్రతి చెరువు నింపి మూడు పంటలు పండించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.