నాగర్కర్నూల్, ఫిబ్రవరి 7 : నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. నాగనూలు గ్రామంలోని 4, 5వ వార్డుల్లో ప్రచారం చేసి తిరిగి వస్తున్న సమయంలో మర్రి వద్దకు మహిళలు పెద్దఎత్తున చేరుకొని కొత్త పింఛన్లు రావడం లేదని వాపోయారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బాగుండే.. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మా సమస్యలు పరిష్కరించెటోళ్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వారి సమస్యలు తెలుసుకున్న మర్రి భావోద్వేగానికి లోనయ్యారు.