సంగెం, డిసెంబర్ 19: రైతుల చేన్ల వద్దకే మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పొలాల నుంచే నేరుగా హైదరాబాద్కు పంట ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. సెర్ప్, సంగమేశ్వర మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ఈ సేవలను ప్రారంభించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం గాంధీనగర్ గ్రామ రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు పండించిన మూడు టన్నుల పుచ్చకాయలను సోమవారం బెనీషాన్ కంపెనీ ద్వారా హైదరాబాద్కు పంపించారు.
మార్కెటింగ్ వాహనాన్ని అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్తో కలిసి ఎంపీపీ కందకట్ల కళావతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేండ్లుగా రైతులు పండించిన కూరగాయలు, పండ్లను బెనిషాన్ సంస్థ ద్వారా హైదరాబాద్కు పంపిస్తున్నామని చెప్పారు. రైతుల పొలాల నుంచే రవాణా ఖర్చులు లేకుండా గిట్టుబాటు ధర సేకరించి రాష్ట్రప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లో మార్కెటింగ్ చేస్తున్నట్టు తెలిపారు.