ములుగు : సమ్మక్క సారక్క తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామ శివారులోని దట్టమైన అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల డంప్పై ఓ అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇవ్వడంతో అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ పాతిపెట్టిన డంప్ను పోలీసులు వెలికితీశారు.
25 డిటోనేటర్లు, 25 జిలెటిన్ స్టిక్స్, మెడికల్ కిట్తో పాటు తీగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మీడియాకు తెలిపారు. డంప్ లభ్యం కావడంతో ఆ ఏరియాలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నట్లు సమాచారం.