హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ): సామాజిక సంఘ సంసర్త మహాత్మా జ్యోతిబా ఫూలేకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని పలువురు వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫూలే 198వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా, కులసంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.
ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల కోసం ఫూలే చేసిన కృషిని ఈ సందర్భంగా వక్తలు స్మరించుకున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో 150 అడుగుల ఫూలే విగ్రహాన్ని ఏర్పా టు చేయాలని, ఆయన పేరిట సంఘ సంసర్తలకు అవార్డులు ప్రదానం చేయాలని కోరారు. ఫూలే జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయా వేడుకల్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కార్యదర్శి మాయాదేవి, బీసీ గురుకులాల కార్యదర్శి సైదు లు, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్కుమార్, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం, వివిధ బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.