హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో గులాబీ శ్రేణులు ఒకవైపు కుటుంబ సభ్యులతో సహా పండుగ వాతావరణంలో పాలు పంచు కుంటుండగా..మరోవైపు టీఆర్ఎస్లోకి వలసల ప్రవాహం కొనసాగుతుంది.
ఇదే క్రమంలో మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఇప్పర్తి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పాల సొసైటీ చైర్మన్ చీమల వరుణ్ యాదవ్, మాజీ గ్రామ పంచాయతీ సభ్యుడు ఈరటి శ్రీశైలం, పెద్ద గొల్ల బూడిద నరసింహా యాదవ్, బచ్చనగోని లింగస్వామి,ఈరటి శంకర్, ఆడెపు ప్రశాంత్, బొజ్జ యాదయ్య, అడిమయ్య, బబుల్, కట్ట రమేష్, బద్దుల శేఖర్, పాసు సాయిచంద్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు.
పార్టీలో చేరిన వారికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్హనించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు భవనం శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ సుజాత, పంచాయతీ సభ్యులు నరేందర్, సైదులు, పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.