నల్లగొండ : సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామానికి చెందిన బీఎస్పీ గ్రామ శాఖ అధ్యక్షుడు మునుగోటి సత్తయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూనె లింగయ్య, ఇటుకల రమేష్ చారి, బెల్లపు అశోక్,బెల్లపు కిరణ్, ఎండి మోసిన్, పల్లపు స్వామి, రూపని మురళి, 40 మంది గ్రామానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండుకాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ది జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలువుడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేడి కృష్ణయ్య, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నర్రా శ్రీకాంత్ రెడ్డి, మేడి రాజు, బీఆర్ ఎస్ అధికార ప్రతినిధి నర్ర భిక్షం రెడ్డి, 6వార్డు సభ్యులు నర్ర వెంకటరెడ్డి, దూదిగామ సతీష్, జాల ప్రకాష్, నందిపాటి హరీష్, అరుణ్, సిరిపంగి మధు, మేడి శివప్రసాద్, మేడి హరికృష్ణ, నందిపాటిశంకర్, సిరిపంగి హరికృష్ణ, అంజనపల్లి శివసాయి, నితిన్ తదితరులు ఉన్నారు.