హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం లోయలోపడింది. ఘాట్ రోడ్డు 28వ మలుపు వద్ద పిట్టగోడను ఢీకొట్టి, లోయలోకి దూసుకెళ్లింది.
అదే సమయంలో ఆ మార్గాన వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది బస్సు అద్దాలు ధ్వంసం చేసి ప్రయాణికులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, పలువురు భక్తులు గాయపడ్డారు. వారిని రుయా దవాఖానకు తరలించారు. ప్రమాదానికి అధికవేగమే కారణమని పోలీసులు పేర్కొన్నారు.