KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళవారం మధ్యాహ్నం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో పరిసరాలు జనసంద్రంగా మారాయి. చాలామంది రావడంతో ఒక్కొక్కరిని సిబ్బంది లోపలికి అనుమతించారు.
గంటల తరబడి కార్యకర్తలు వేలాదిగా వస్తూనే ఉండడంతో కేసీఆర్ స్వయంగా బయటకు వచ్చి కార్యకర్తలకు, నేతలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మీ అభిమానానికి ధన్యవాదాలు అని, మనమందరం కలిసికట్లుగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ఇకముందు మన ప్రయాణం చాలా ఉందని పేర్కొన్నారు.
ఉగాది పర్వదినాన ఎర్రవల్లిలోని తన నివాసానికి విచ్చేసి గ్రామ ప్రజలను కలిసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. https://t.co/gPc9R24L4c pic.twitter.com/QtUr9rL8KM
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2024
కేసీఆర్ను కలిసిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు జహంగీర్, మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు జుబేర్లు తదితరులు ఉన్నారు.