Peddapalli | మంథని, నవంబర్ 23: తెలంగాణ ప్రజ లు చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధానాలపై నిర్మోహమాటంగా కుండబద్దలు కొడుతున్నారు. సీఎం కేసీఆర్ తన ప్రసంగా ల్లో ‘రాయేదో.. రత్నమేదో.. అభ్యర్థి ఎవరో.. ఆయన ఏ పార్టీవాడో.. ఆ పార్టీకున్న చరిత్ర ఏందో చూసి ఓటేయాలి. ఇంటికి వెళ్లి చర్చపెట్టాలి’ అని చెప్పిన మాటలతో స్ఫూర్తిపొందిన పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కమాన్పూర్ మండలం పెంచికల్పేటకు చెం దిన అనవేన రమ్య అనే మట్టి బిడ్డ భావోద్వేగంతో నిష్కల్మషంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. గురువారం పెంచికల్పేటకు బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి రాగా.. రమ్య మైక్ తీసుకొని 70 ఏండ్ల కాంగ్రెస్ పాలన, పదేండ్ల కేసీఆర్ పాలనను పోల్చిచెప్పారు.
అప్పటి కష్టాలు.. ఇప్పుడు అమలవుతున్న పథకాలను వివరించారు. ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రమ్య మాటల్లోనే..‘అరవై, డబ్బు ఏండ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మనకు నీళ్లు లేవు.. రైతుబంధు లేదు. రైతుబీమా లేదు.. నీళ్ల ప్రాబ్లం చేయవట్టి కొన్ని వేల ఎకరాల భూములు బీళ్లున్నాయి. కేసీఆర్ తెచ్చిన నీళ్లతో నిరుడు 40 ఎకరాలు సాగు చేయగా, వ్యవసాయంలో మేము బాగా ఎదిగినం. కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, నీళ్లు అన్ని ఇస్తుండు. ఆడపిల్ల కల్యాణానికి తోడబుట్టిన అన్నే 10 వేలు ఇస్తలేడు. ఇద్దరు ఆడపిల్లలున్నా కేసీఆర్ కల్యాణలక్ష్మి ఇస్తుండు. ఇవ్వన్ని చేసిన కేసీఆర్ను, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధును గెలిపించాలి.
మధన్న కు ఓటు వేయలేదంటే మన ప్రాణం పోయినట్టే. మా కుటుంబంలో మొత్తం 12 ఓట్లు ఉన్నయ్. ఇవన్నీ పుట్ట మధన్నకే. ముత్తారం మండలం మైదంబండ మా అమ్మవాళ్ల ఊరు. మేము చిన్నప్పటినుంచి శ్రీధర్బాబు చూస్తా న్నం. ఆయన చేసిన పనేం లేదు. ఒక్కరు కొట్లాడితే అచ్చేది కాదు. అందరు కొట్లాడాలి.. కచ్చితంగా పుట్ట మధన్నను గెలిపియ్యాలి’ అంటూ ప్రసంగాన్ని వినిపించింది. ఆమె ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు జై బీఆర్ఎస్.. జై కేసీఆర్.. జై పుట్ట మధన్న అంటూ నినాదాలు చేశారు. భావోద్వేగపూరితంగా రమ్య మాట్లాడిన తీరు ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసింది.