Nagarkurnool | నాగర్కర్నూల్ : అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరు గిరిజన బాలికల పాఠశాల వార్డెన్ సస్పెండ్ అయ్యారు. వార్డెన్ మంగమ్మను గిరిజన సంక్షేమ శాఖ అధికారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గిరిజన సంక్షేమ శాఖ అధికారి చర్యలు తీసుకున్నారు.
గురువారం రాత్రి మన్ననూరు గిరిజన బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 40 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది విద్యార్థినులను అంబులెన్స్ ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినులు కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇద్దరు విద్యార్థినులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడటంతో.. వారిని అచ్చంపేట, నాగర్కర్నూల్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం భోజనం చేసిన తర్వాతే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థినులు ఆరోపించారు. ఈ క్రమంలో విచారణ జరిపిన అనంతరం వార్డెన్ మంగమ్మను సస్పెండ్ చేశారు.