యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 20 (నమ స్తే తెలంగాణ): వందల విద్యార్థులకు ఉచితం గా విద్యనందించే సంస్థ మనుగడ మోదీ సర్కారు నిర్వాకం వల్ల ప్రశ్నార్థకంగా మారిం ది. విదేశీ నిధులతో నడుస్తున్న సంస్థకు నిధు లు రాకుండా అడ్డుకొంటున్నది. తీవ్రవాదులకు వర్తించే మాదిరి సంస్థ ఖాతాను బ్లాక్ చేసింది. ఫలితంగా నిధులు సకాలంలో రాకపోవడంతో సుమారు 26 గ్రామాలకు చెందిన 1,200 మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని బోడంగిపర్తికి చెందిన మంచికంటి లక్ష్మయ్య అమెరికాలో స్థిరపడ్డారు. తన తండ్రి మంచికంటి యాదగిరి స్మారకార్థం గ్రామంలో పాఠశాల, ఇంటర్ కాలేజీని నిర్మించి 2003 నవంబర్ 10న ప్రారంభించారు. అప్పట్నుం చి విద్యార్థులకు కార్పొరేట్స్థాయిలో ఉచితం గా విద్యనందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1200 మంది అభ్యసిస్తున్నారు. మంచి వాతావరణం, క్లాస్రూమ్లు, విశాలమైన గ్రౌండ్, మంచినీటి సదుపాయం, పార్కు, టాయిలె ట్లు, నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉన్నారు. మధ్యాహ్న భోజనంతోపాటు ఇంట ర్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. చండూరుతోపాటు మునుగోడు, గట్టుప్పల, నాంపల్లి మండలాలకు చెందిన 26 గ్రామాల విద్యార్థులు చదువుతున్నారు.
6 ఏండ్ల నుంచి అకౌంట్ బ్లాక్
2003 నుంచి సజావుగా సాగుతున్న విద్యాసంస్థపై కేంద్రం తీసుకొన్న నిర్ణయం శరాఘాతంలా మారింది. 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్రవాదులు, మిషనరీలు, ఇతర సంస్థలకు విదేశాల నుంచి వచ్చే నిధుల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేయడంతో మంచికంటి ట్రస్ట్ అకౌంట్ కూడా స్తంభించిపోయింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సర్టిఫికెట్ సహా అన్ని పత్రా లు సమర్పించినా పునరుద్ధరించలేదని ట్రస్టు సభ్యులు చెప్తున్నారు.
అకౌంట్ పునరుద్ధరిస్తేనే ఓట్లు
మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్గురువారం బోడంగిపర్తిలో నిర్వహించిన ప్రచారంలో మంచికంటి యాదగిరి ట్రస్ట్కు తాను ఏదో చేస్తున్నట్టు చెప్పబోయారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బాధ్యతలు చూసే మంచికంటి వెంకటరమణను ప్రచార రథంపైకి రావాలని ఆహ్వానించగా ఆయన నిరాకరించారు. ట్రస్ట్ అకౌంట్ను పునరుద్ధరించాలని ఆయన చేతులెత్తి దండం పెట్టగా.. అమిత్షా హామీ ఇచ్చారని, తప్పకుండా చేస్తామని రొటీన్ హామీఇచ్చారు. రాజగోపాల్మాటలను నమ్మేది లేదని మంచికంటి వెంకటరమణ ‘నమస్తే తెలంగాణ’తో అన్నారు.
మూతబడే ప్రమాదం
విద్యాసంస్థ నిర్వహణకు నెలకు రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతున్నాయి. ఆరేండ్ల నుంచి రూ.8 కోట్ల దాకా సొంతంగా ఖర్చుచేశా రు. ట్రస్టు ఖాతా బ్లాక్ చేయడంతో ఈ నిధులను మంచికంటి లక్ష్మ య్య అమెరికా నుంచి వేరే అకౌం ట్ ద్వారా పంపిస్తున్నారు. ఇది కూడా బ్లాక్ అయ్యే అవకాశాలున్నాయి. నిధులు సకాలంలో రాకపోవడంతో నిర్వహణ భారంగా మారుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 19 ఏండ్లుగా నడుస్తున్న విద్యాసంస్థ త్వరలో మూతబడే ప్రమాదం ఉన్నదని మేనేజ్మెంట్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.