ఇల్లెందు, ఆగస్టు 10: ‘పింఛన్ పెంచుతవో.. గద్దె దిగుతవో తేల్చుకో రేవంత్రెడ్డి’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 20 నెలలైనా దివ్యాంగుల పింఛన్ పెంచడంలో విఫలమైందని అన్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో ఆదివారం నిర్వహించిన దివ్యాంగు లు, చేనేత కార్మికుల మహాగర్జన సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని దివ్యాంగులు, చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈలోగా దివ్యాంగులకు పింఛన్ పెంచకపోతే సీఎం రేవంత్రెడ్డిని గద్దె దించుతామని హెచ్చరించారు.