కోటపల్లి, అక్టోబర్ 5: ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన హరితనిధికి మేము సైతమంటూ ఆసరా పింఛన్దారులు కదిలారు. ఆసరా ద్వారా అండగా నిలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి తమవంతుగా ఒక్కొక్కరు ప్రతినెలా రూ.6 చొప్పున ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని షట్పల్లికి చెందిన 183 మంది ఆసరా పింఛన్దారులు. వీరు ఒక్కొక్కరు రూ.6 చొప్పున నెలకు రూ.1,098 జమ చేయనున్నారు. సీఎం కేసీఆర్ సంకల్పించినట్టుగా తాము కూడా హరితనిధికి చేయూతనందించేందుకు ముందుకు వచ్చినట్టు వారు పేర్కొన్నారు.
హరితనిధికి ప్రతినెలా డబ్బులిస్తామని తీర్మానం చేసిన మంచిర్యాల జిల్లా షట్పల్లి ఆసరా పింఛన్దారులు