మంచిర్యాలటౌన్, నవంబర్ 7 : మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (DTDO) ఎం గంగారాంపై సస్పెన్షన్(Suspended) వేటు పడింది. విధులను నిర్లక్ష్యం చేసినందుకుగాను ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కుమార్ దీపక్ ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల పట్టణంలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు బుధవారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు.
ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాలేదు. ఈ అంశం రాష్ట్ర అధికార యంత్రాంగానికి తెలిసి వివరణ కోరగా వారిని తప్పుదోవ పట్టించేలా సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే అస్వస్థతకు గురైన 12 మంది విద్యార్థినులను ప్రభుత్వ దవాఖానలో చేర్పించి మెరుగైన వైద్యం అందించారు. వారంతా ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఫార్ములా -ఈ రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదు.. మండిపడ్డ కేటీఆర్
KTR | ఫార్ములా-ఈ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది : కేటీఆర్
KTR | కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకొస్తది : కేటీఆర్