హైదరాబాద్ : లిక్కర్ పార్టీ ఇయ్యలేదని దాడి చేయడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ దారుణ సంఘటన నగరంలోని బోయినపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు న్యూబోయినపల్లిలో గల బాపూజీనగర్కు చెందిన ఎం.వినోద్ కుమార్(35) ఆదివారం రాత్రి తన ఇంటికి సమీపంలో తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. గమనించిన బంధువులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మరణించాడు.
వినోద్కుమార్ పరిచయస్థుడు రాజు అనే వ్యక్తి లిక్కర్ పార్టీ ఇవ్వాల్సిందిగా వినోద్ను అడిగాడు. అయితే డబ్బులు లేకపోవడంతో వినోద్ నిరాకరించాడు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైనా రాజు, వినోద్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో లోపలి గాయాల కారణంగా వినోద్ మరణించాడు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.