సూర్యాపేట: జిల్లాలోని మోతెలో (Mothey) దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి జనార్దన్రెడ్డి అనే వృద్ధుడిని దుండగులు కత్తులతోపొడిచి హత్య చేశారు. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థాలానికి చేరుకన్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. భూవివాదమే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో హైదరాబాద్లోని మల్కాజిగిరి విమలాదేవి నగర్లో ఓ మహిళ హత్యకు గురయింది. ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తలుపులను బద్దలు కొట్టి చూడగా మహిళ మరణించి ఉన్నది. మూడు రోజుల క్రితం ఆమె మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మానసిక స్థితి సరిగాలేని ఆమె కుమారుడే ఈ హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.