ఎదులాపురం, మే 18 : ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు చేసినట్టు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన ఠాణాలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీకి చెందిన జాస్మిన్ (28)కు అదే కాలనీకి చెందిన అబ్దుల్అతీక్తో 2017లో వివాహమైంది.
వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండేండ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో భర్తపై వేధింపుల కేసు నమోదైంది. భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పగా బాధితురాలు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సెక్షన్ 4 ఆఫ్ ది ముస్లిం ఉమెన్ (వివాహ హక్కుల రక్షణ) చట్టం 2019 ప్రకారం కేసు నమోదు చేశారు.