హైదరాబాద్ : ములుగు జిల్లా వెంకటాపురం కొండాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. మరదలిపై వ్యామోహంతో ఓ ఉన్మాది తన భార్య, అత్త, అమ్మమ్మపై కత్తితో దాడి చేశాడు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా.. వారు చికిత్స పొందుతున్నారు.