హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ (ఎస్సీ రిజర్వు) లోక్సభ నియోజకవర్గం హాట్ సీటుగా మారనున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి ఇదే నియోజకవర్గం పరిధిలో ఉండటంతో మరింత ప్రాధా న్యం సంతరించుకుంటున్నది.
నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొన్నది. ఇదే స్థానం నుంచి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ మల్లు రవి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జోడు పదవులు ఉండరాదన్న కాంగ్రెస్ నియామావళి తనకు అడ్డంకిగా మారుతుందేమోనన్న భయంతో ఆయన ఇప్పటికే ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఇదే టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇదే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఆలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్కు చెందినవాడిని కావడంతో స్థానికుడినైన తనకే టికెట్ ఇవ్వాలని సంపత్కుమార్ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. నాగర్కర్నూల్ టికెట్ తనకే ఇస్తానని సీఎం రేవంత్రెడ్డి మాట ఇచ్చారని సంపత్కుమార్ ప్రచారం చేసుకుంటున్నారు. వావ్తవానికి మల్లు రవి సీఎం రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అయితే ఖమ్మం నుంచి ఎంపీ టికెట్ రేసులో మల్లు రవి సోదరుడు భట్టి విక్రమార్క సతీమణి నందిని రేసులో ఉండటంతో ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో సంపత్కుమార్ ఉన్నారు.
ఒకవైపు ఎంపీ టికెట్ కోసం తాను ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవిని వదులుకున్నప్పటికీ, సంపత్కుమార్కు టికెట్ ఎలా ఇస్తారన్నది మల్లు రవి వాదన. ఎంపీ టికెట్ ఇస్తారన్న నమ్మకంతోనే ఎన్నికల వ్యయం కోసం తన ఇల్లు అమ్ముకున్నట్టు సంపత్కుమార్ చెప్తుండటంతో మల్లు రవి ఆందోళనకు గురవుతున్నా రు. నాగర్కర్నూల్ టికెట్ తనకే దక్కుతుందని సంపత్కుమార్ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో మల్లు రవి మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు.
గతంలో నాగర్కర్నూల్ ఎంపీగా పనిచేసిన తనను స్థానికుడు కాదంటున్న పార్టీ నేతలపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గతంలో ఇదే స్థానం నుంచి తన సోదరుడు దివంగత మల్లు అనంతరాములు, తాను కూడా ప్రాతినిధ్యం వహించిన విష యం గుర్తుచేశారు. అప్పుడు రాని స్థానిక నినా దం ఇప్పుడెలా వస్తుందని పార్టీ పెద్దలకు మ ల్లు రవి వివరించినట్టు తెలిసింది. సంపత్కుమార్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం.