ఖైరతాబాద్, జనవరి 2: కొమురవెల్లి మల్లన్న పూజా బాధ్యతలను అసాదులకే (గొల్లకురుమ, ఒగ్గు కళాకారులు)కే ఇవ్వాలని ఓయూ విద్యార్ధి నేత కురుమ శ్రీశైలం కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వందల ఏండ్లుగా మల్లన్న పూజలు అసాదులే ఆనవాయితీగా నిర్వహిస్తున్నారని తెలిపారు. గడిచిన 30 ఏండ్లుగా ఆ బాధ్యతలను ఇతర పూజారులకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది జాతరలోగా తమ విధానంలో పూజ చేసే అవకాశం కల్పించాలని, త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తమకు అనుమతి ఇవ్వకపోతే ఆమరణ దీక్షకు సైతం వెనుకాడమని స్పష్టం చేశారు. సమావేశంలో అగ్గు సంతోష్ యాదవ్, పీ ప్రసాద్, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.