నల్లగొండ, మార్చి 12 : ‘కేసీఆర్ గెలిస్తేనే మాకు బుక్కెడు బువ్వ. ఈ సారి కేసీఆర్ సా రు లేక బత్తాయి తోట, పొలం ఎండిపోయిం ది. ఎండిన పొలం మేకల పాలైంది. బువ్వకాడికి పోతే సంతోషం లేదు. చేను కాడికి వస్తే కుషాల్ లేదు. చేసిన అప్పు తీర్చేదెట్ల? సచ్చిపోయిన కొడుకుకు ఉన్న చిన్న చిన్న కూనలను సాదేదెట్ల? కడుపు గుద్దుకుంటున్న. పురుగుల మందు తాగాలనిపిస్తుంది. లేదంట కంపల్ల ప డి సచ్చిపోవాలనిపిస్తుంది’ ఇదీ నల్లగొండ మండలం ముషంపల్లికి చెంది న రైతు గన్నెబోయిన మల్లయ్య ఆవేదన. 9 ఎకరాలు ఉన్న మల్లయ్యకు ఇప్పటికీ రైతుబంధు రాలేదు. పంట ఎండి పెట్టుబడి మీదపడటంతో ఓ వీడియోలో వ్యక్తం చేసిన తన ఆవేదన వైరల్ అయింది. ఇందుకు స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘మల్లయ్య మాటలు మనసుకు తగిలాయని, త్వరలోనే ముషంపల్లికి వచ్చి మల్లయ్యతోపాటు బోర్ల రాంరెడ్డిని కలుస్తానని’ ఎక్స్లో ట్వీట్ చేశారు.