హైదరాబాద్ : ప్రముఖ ప్రవచనకర్త, తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత పండితుడిగా ప్రసిద్ధి చెందిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి(96) పరమపదించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రశేఖర శాస్త్రి.. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు.
పురాణాలను శాస్త్రబద్ధంగా చెప్తూ ఎందరో ఆస్తికులకు ధర్మమార్గాన్ని చూపించిన పౌరాణికులు శాశ్వత శివసాయుజ్యాన్ని పొందారని తెలియజేయుటకు చింతిస్తున్నాము అని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 15 ఏండ్ల వయసు నుంచే ప్రవచన యజ్ఞాన్ని చంద్రశేఖర శాస్త్రి ప్రారంభించారు. చంద్రశేఖర శాస్త్రి మృతిపట్లు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.