హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు గోర్ల సదానందం కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్లో చికిత్స పొం దుతూ శనివారం మృతిచెందారు. ఆయనకు భార్య, 8 నెలల చిన్నారితోపాటు తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా విద్యార్థి జేఏసీలో సదానందం కీలకంగా వ్యవహరించారని ఆయనతో కలిసి పనిచేసిన పలువురు మిత్రులు గుర్తుచేసుకున్నారు.
సదానందం ఓయూలో పీజీ చే స్తూనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఓయూలో జరిగిన విద్యార్థి ఉద్యమ గర్జనతోపాటు మిలియన్మార్చ్, సాగరహారం లాంటి కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారు. శనివారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా ఓదెలలో సదానందం అంత్యక్రియలు పూర్తయ్యాయి.