హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తె లంగాణ): మాకిస్తామన్న రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిందే.. రైల్వే వ్యాగన్ తయా రీ కేంద్రం అవసరమే లేదు.. 40 ఏండ్ల మా పోరాటాన్ని కేంద్రం చులకన చేసింది.. ఎట్టి పరిస్థితుల్లో పోరాటాన్ని ఆపబోము.. హామీ ఇచ్చినట్టే ఇచ్చి దగా చేసింది.. అంటూ తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాదికి అవకాశాలు ఇచ్చిన కేంద్రం దక్షిణాదిలో కూడా అలాంటి అవకాశాలు కల్పించాలని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని రైల్వే ఉద్యోగ సంఘాలూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లొద్దని హితవు పలుకుతున్నాయి.
అయినా కేంద్రం ముం దుకొస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందేనని ఈ ప్రాంత ప్రజలు సైతం పెద్ద ఎత్తున డిమాం డ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా మడికొండ రెవెన్యూ అయోధ్యపురం పరిధిలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీ ని కేంద్రం నిలబెట్టుకోలేకపోయింది. కంటితుడుపు చర్యగా ప్రజలను మభ్యపెట్టేందుకు కేవలం రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేస్తున్నామంటూ ప్రకటించింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో వేలాది ఉద్యోగావకాశాలు దక్కుతాయన్న ఆశ నిరాశే అయ్యింది. వ్యాగన్ తయారీ యూనిట్తో పెద్దగా ఒరిగేదేమి లేదని యువత భగ్గుమంటున్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి తీరాల్సిందేనని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు.
కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాల్సిందే..
రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర సర్కారు 160 ఎకరా ల స్థలాన్ని 114 మంది ల బ్ధిదారుల నుంచి సేకరించి ఇచ్చింది. రైల్వే వ్యాగన్ యూనిట్ నిర్మాణంతో కేంద్రం చేతులు దులుపుకుంటున్నది. కచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పా టు చేయాలి. ఉత్తరాదికి కాకుండా దక్షిణాదికి కూడా రైల్వేలో సరైన అవకాశాలు దక్కాలి.
– దేవులపల్లి రాఘవేందర్, కన్వీనర్, తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ