Minister Indrakaran Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ సభను జయపద్రం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని పట్టణంలో దివ్యా గార్డెన్స్లో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ముఖ్యకార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. జూన్ 4న సమీకృత కలెక్టర్ కార్యాలయం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు.
అనంతరం బహిరంగ సభ ఉంటుందన్నారు. సభకు పెద్దఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని ఆయనపై అభిమానంతో ప్రజలు భారీగా సమావేశానికి హాజరుకావాలని కోరారు. అన్ని గ్రామాల నుంచి ప్రజలను సభకు తీసుకొచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.