భీమ్గల్, ఫిబ్రవరి 8 : అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ది అందెవేసిన చెయ్యి అని, కాంగ్రెస్ అబద్ధాలకు మరోసారి ఆగం కావొద్దని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సూచించారు. ఆదివారం రాత్రి భీమ్గల్లో మైనారిటీ మహిళల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలతో ఇప్పటికే మోసపోయామని, ఢిల్లీ వాళ్లు వచ్చి ఇక్కడ చేసేదేమీ లేదని తెలిపారు.
తెలంగాణ ఏర్పడ్డాకే మైనారిటీలకు ఉగౌరవం దక్కిందని, అది కేసీఆర్తోనే సాధ్యమైందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో మైనారిటీల పిల్లల కోసం 240 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని తెలిపారు. బాల్కొండను ఎంతో అభివృద్ధి చేసిన వేముల ప్రశాంత్రెడ్డిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి గడ్డం సు మనారెడ్డి, మైనారిటీ నాయకుడు మోయిజ్, బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, మైనారిటీ మహిళలు పాల్గొన్నారు.