హైదరాబాద్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ): ఎన్నారై అంటే.. నాన్ రిలయబుల్ ఇండియన్ అని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడాన్ని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఖండించారు. ఎన్నారైలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నారైలు దేశఆర్థిక వ్యవస్థకు అండగాఉంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు.
అసెంబ్లీ సాక్షిగా ఎన్నారైలను అవమానపరుస్తూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ఖండించారు. వెంటనే ఎన్నారైలకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. రేవంత్రెడ్డికి రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు ఎన్నారైలు గొప్పగా కనిపిస్తారని, అవసరం తీరాక అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.